ఏపిభవన్‌లో బాబు దీక్ష ప్రారంభం

 

రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్‌ అనుసరిస్తున్న తీరుకు నిరసనగా చంద్రబాబు నాయుడు దీక్షకు దిగారు. సోమవారం మధ్యాహ్నం న్యూడిల్లీలోని ఏపిభవన్‌ ఆవరణలో ఏర్పటు చేసిన దీక్ష శిభిరంలో ఆయన దీక్ష ప్రారంభించారు. అంతకు ముందు గాందీ ఘాట్‌లో నివాళులర్పించిన ఆయన, ఏపి భవన్‌ ఆవరణలోని అంబేధ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు. బాబు దీక్షకు మద్దతుగా సీమాంద్ర ప్రాంతం తో పాటు, తెలంగాణ నుంచి కూడా పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తు మద్దతు పలికారు.