జంతర్‌ మంతర్‌లో బాబు దీక్ష

 

విభజనపై కాంగ్రెస్‌ వైఖరికి నిరసనగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తలపెట్టిన దీక్షకు వేదిక ఖరారయింది. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో యన దీక్షకు దిగుతున్నట్టుగా తెలుగుదేశం పార్టీకి వర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయం ప్రారంభం కానున్న ఈ దీక్షకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

అయితే బాబుతో పాటు దీక్షలో పాల్గొనటానికి పెద్దయెత్తున కార్యకర్తలు అభిమానులు సిద్దమవుతున్నారు. బాబు చేపట్టిన ఈ దీక్షకు తెలంగాణ తో పాటు సీమాంద్ర ప్రాంతం నుంచి కూడా పలువురు అగ్రశ్రేణి నాయకులు హాజరు అవుతున్నారు.

 

అయితే ఈ దీక్ష తెలంగాణ ప్రకటనకు వ్యతిరేకం కాదంటున్నాయి పార్టీ వర్గాలు, విభజన విషయంలో కాంగ్రెస్‌ అనుసరిస్తున్న వైఖరితో పాటు, సీమాంద్ర ప్రజల్లో నెలకొన్న భయాలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో చంద్రబాబు దీక్షకు దిగుతున్నారు.