కరోనా ఆర్ధిక ప్యాకేజ్ ప్రకటించిన కేంద్రం

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి కేంద్రం ఆర్దిక సహాయం ప్రకటించింది. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్, వలస కార్మికులకు -ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పధకం కింద 1. 70 లక్షల కోట్ల ప్యాకేజి  ప్రకటించారు. ఆకలి చావులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆమె వెల్లడించారు. లాక్ డౌన్ తో దెబ్బతిన్న పేదలు, రోజు కూలీల కోసం కూడా కేంద్రం ప్యాకేజ్ ప్రకటించింది.  వైదులు, నర్సులు, పారిశుధ్య కార్మికులకు హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రకటించిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్, ఇన్స్యూరెన్స్ మొత్తం ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల వంతున ఉంటుందని వివరించారు.