మీడియాని అణిచేస్తాననడం భావ్యం కాదు.. వెంకయ్య...

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో మీడియా మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. మీడియా స్వేచ్ఛను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, మీడియాను తొక్కి పెడతాననడం మంచిది కాదని అన్నారు. ఒకవేళ ఏవైనా మీడియా సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టప్రకారం నడుచుకోవాలని ఆయన సూచించారు. మరీ ఇబ్బంది అనిపిస్తే ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఇలాంటి సున్నిత విషయాలలో ప్రభుత్వం నడిపే పెద్దలకు సహనం అవసరమని వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రతిపక్షాలకు ప్రజలకు సముచిత స్థానం ఇస్తేనే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని వెంకయ్య అన్నారు.