TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వెంకయ్య నాయుడు హెచ్చరిక ఎవరికి?

Published on: Sat Aug 2, 2014 5:56PM

 

ఈరోజు ఆంధ్ర, తెలంగాణా ముఖ్యమంత్రులను వేర్వేరుగా కలిసిన కేంద్ర మంత్రి యం.వెంకయ్య నాయుడు, తరువాత మీడియాతో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలను ఇరు ప్రభుత్వాలు ఖచ్చితంగా పాటించాలని, కొత్తగా వివాదాలు సృష్టించే ప్రయత్నాలు చేయవద్దని హితవు పలికారు. ఉన్నత విద్యా సంస్థల ప్రవేశాలలో పదేళ్ళ పాటు ప్రస్తుత విదివిధానాలే అమలు చేయాలని విభజన చట్టంలో స్పష్టంగా పెర్కొనబడినప్పటికీ, తద్విరుద్ధంగా వ్యవహరిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసారని అర్దమవుతూనే ఉంది. అయితే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవ తీసుకొని విద్యార్ధుల ఫీజు రీ-ఇంబర్స్ మెంటును 52:48 నిష్పత్తిలో భరిద్దామని చేసిన ప్రతిపాదననే ఖాతరు చేయని కేసీఆర్ వెంకయ్యనాయుడు చెప్పే ఈ హితోక్తులను పట్టించుకొంటారని ఆశించడం అత్యాసే అవుతుంది. అయితే కేంద్రమంత్రిగా వెంకయ్యనాయుడు భాద్యతగా తను చెప్పవలసిన నాలుగు మంచి ముక్కలు చెప్పారు. అంతే!