బ్యాంకులకు కేంద్రం వార్నింగ్..


పెద్ద నోట్ల రద్దు అనంతరం ఐటీ శాఖ చేస్తున్న దాడుల్లో నల్లధనం కుప్పలు కుప్పలుగా దొరుకున్నసంగతి తెలిసిందే. ఆశ్చర్యం ఏంటంటే అందులో కొత్త కరెన్సీ నోట్లు కూడా ఉంటడం. ఒక పక్క సామాన్య ప్రజలు బ్యాంకుల వద్దు, ఏటీఎం ల వద్ద క్యూలో నిలబడి కష్టపడుతుంటే.. మరోపక్క కొంతమందికి మాత్రం కొత్త కరెన్సీ నోట్లు కట్టలకి కట్టలు వచ్చి పడుతున్నాయి. ఆ విషయం బయటపడుతున్న నల్లధనాన్నిచూస్తుంటేనే అర్ధమవుతోంది. ఈనేపథ్యంలోనే కేంద్రం బ్యాంకులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే నల్లకుబేరులతో చేతులు కలిసి రద్దైన నోట్లను వైట్మనీగా మార్చడానికి సాయపడిన పలువురిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు మరోసారి వార్నింగ్ ఇచ్చింది. అధికారులెవరు అక్రమాలకు పాల్పడినా వదిలేది లేదంటూ, ఎవరూ కూడా తప్పించుకోలేరంటూ.. మరోసారి హెచ్చరించింది. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై మంత్రిత్వశాఖ చాలా సీరియస్గా చర్యలు తీసుకుంటుందని వెల్లడించింది.