రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ

అన్ని రాష్ట్రాల సరిహద్దులు మూసివేయాలని ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం. కేవలం నిత్యావసర సరుకుల మాత్రమే అనుమతించాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జిల్లా సరిహద్దులను కూడా మూసేయలని కేంద్రం ఆదేశాలుఇప్పటికే కొత్తగా వచ్చిన వారిని 14 రోజులు క్వారంటైన్ లోనే ఉంచాలి. నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణాలు చేస్తే కఠినంగా వ్యవహరించాలి. విద్యార్థులు, కార్మికులను ఇళ్ళు ఖాళీచేయాలని ఒత్తిడి చేస్తే కఠిన చర్యలు. నగరాల నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు లేకుండా చూడాలని కూడా కేంద్రం సూచించింది.