హస్తినలో చంద్రబాబు బిజీబిజీ
Published on: Thu Mar 6, 2025 9:40AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. దగ్గుబాటి వెంటకేశ్వరరావు పుస్తకావిష్కరణ కోసం హస్తిన కు వెళ్లిన చంద్రబాబు.. అంతకంటే ముందు కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో బిజీబిజీగా ఉన్నారు.
తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తరువాత విత్తమంత్రి నిర్మలాసీతారామన్, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో సమావేశమయ్యారు. ఈ భేటీలలో ఏపీకి రావలసిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. ఈ భేటీలలో చంద్రబాబుతో పాటు కూటమి పార్టీల ఎంపీలు కూడా ఉన్నారు. చంద్రబాబుతో భేటీపై సోషల్ మీడియాలో స్పందించిన గడ్కరి ఏపీలో ప్రస్తుతం సాగుతున్న రహదారుల అభివృద్ధి పనులపై సమీక్షించినట్లు పేర్కొన్నారు.


