సాక్షి గ్రూప్ కి ప్రచార ప్రకటనలు నిలిపివేసిన ప్రభుత్వం
Published on: Thu May 10, 2012 10:02AM
జగన్ కు చెందిన సాక్షి టివి, పత్రికలకు ప్రచార ప్రకటనలు( అడ్వర్టైజ్ మెంట్స్) ను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాక్షి బ్యాంకు ఖాతాలను సిబిఐ స్తంబింప చేసినందున, చట్ట విరుద్దంగా వచ్చిన పెట్టుబడులపై విచారణ జరుగుతున్నందున అడ్వర్టైజ్ మెంట్స్ ను నిలిపి వెస్తున్నామని ప్రభుత్వం తన ఉత్తర్వులలో పేర్కొంది. దీనితో సాక్షి ఆర్దికంగా మరింత ఇబ్బంది పడవచ్చు. సాక్షి ఖాతాలలో 113 కోట్ల రూపాయలను సిబిఐ స్తంభింప చేసింది .గత కొంతకాలంగా ప్రభుత్వం ప్రకటనలు నిలిపివేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. తదనుగుణంగానే ఈ ఉత్తర్వులు విడుదల అయ్యాయని అనుకోవాలి.


