రాజకీయాల్లోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ..?

 

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ రాజీనామా చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర అడిషనల్ డీజీగా ఈయన పనిచేస్తున్నారు. ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు లేఖలు పంపారు. కేంద్ర ప్రభుత్వం ఈ రాజీనామా దరఖాస్తును ఆమోదించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో ప్రచారం జరుగుతుంది. లక్ష్మీ నారాయణ త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నారని.. అంతేకాదు.. కొత్త పార్టీ స్థాపన లేదా.. జనసేన వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.  కాగా గతంలో సీబీఐ జేడీగా లక్ష్మినారాయణ  జగన్ అక్రమాస్తుల కేసులను విచారించిన సంగతి తెలిసిందే.