సీబీఐ కొత్త ట్విస్ట్.. డాక్టర్ సుధాకర్‌పై కేసు నమోదు

డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సీబీఐ పోలీసులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. వీటిలో కుట్ర కోణం, కావాలని తిట్టడం, అక్రమ నిర్బంధం, చోరీ, బెదిరింపులు వంటి సెక్షన్లు ఉన్నాయి. అయితే, తాజాగా డాక్టర్ సుధాకర్ పై కూడా కేసు నమోదు చేసింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి నడిరోడ్డు మీద ప్రజాప్రతినిధులను దూషించడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైన మాట తూలడం, న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేయడం, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం తదితర ఆరోపణలతో కేసు నమోదు చేసింది. 23 మంది సాక్షుల సమాచారంతో పాటు 130 పేజీలతో కూడిన సీడీ ఫైల్‌ను పోలీసులు సీబీఐకి అప్పగించారు. దీంతో వాటిని పరిశీలించి డాక్టర్ సుధాకర్ పై సీబీఐ కేసు నమోదు చేసింది.