విశాఖ ఎంపీ బరిలో జేడీ లక్ష్మీనారాయణ

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీలో చేరినప్పుడే ఆయన విశాఖ ఎంపీగా బరిలోకి దిగే అవకాశం ఉందంటూ వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యాయి. ఇప్పటికే కొందరు అభ్యర్థులను ప్రకటించిన జనసేన తాజాగా మరో జాబితా విడుదల చేసింది. విశాఖ ఎంపీ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నట్లు జనసేన ప్రకటించింది. అదేవిధంగా ఈ జాబితాలో 8 అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది. విశాఖ ఉత్తరం నుంచి పసుపులేటి ఉషాకిరణ్‌, విశాఖ దక్షిణం నుంచి గంపల గిరిధర్‌, విశాఖ తూర్పు నుంచి కోన తాతారావు, భీమిలి నుంచి పంచకర్ల సందీప్‌ అమలాపురం నుంచి శెట్టిబత్తుల రాజాబాబు, పెద్దాపురం నుంచి తుమ్మల రామస్వామి, పోలవరం నుంచి చిర్రి బాలరాజు, అనంతపురం నుంచి టీసీ వరుణ్‌ పోటీ చేయనున్నారు.