TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎన్నికల ఫలితాలను కులాలే నిర్ణయిస్తాయి!

Published on: Wed Jun 22, 2022 9:32PM

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారి పోయిందా?  రాష్ట్ర రాజకీయ స్వభావం వర్గ దృక్పథం నుంచి, కుల సమీకరణ వైపుగా సాగుతోందా? అంటే ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్. రాజకీయ విశ్లేషకులు తిరుమల,అవుననే అంటున్నారు. రాష్ట్ర విభజన అంతరం తెలంగాణా ప్రాంత రాజకీయాలో వచియన్ మార్పులను ఆయన లోతుగ అధ్యయనం చేశారు. విపులంగా విశ్లేషించారు. 

తెలంగాణ సెంటిమెంట్’ను సిద్దాంతంగా మలచు కోవడంలో తెరాస విఫలమైంది. అందుకే, ఒక బలమైన రాజకీయ శక్తిగా నిలవలేక పోయిందని ప్రొఫెసర్ తిరుమల పేర్కొన్నారు. అలాగే, గడచిన ఎనిమిది సంవత్సరాలలో తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోయింది. ఫలితంగా  పార్టీ  ప్రతిష్ట దిగజారింది. ప్రజలకు పార్టీకి మధ్య దూరం పెరిగి పోయింది.  ఈ నేపధ్యంలో తెలంగాణ సమాజం కులాల వారీగా విడి పోయింది, ముఖ్యంగా ఓబీసీ, ఎస్సీ’ఎస్టీ సామాజిక వర్గాల్లో కుల ప్రాతిపదికన ఓటు వేసే పరిస్థితి స్పష్టమైంది. ఈ మూడు ప్రధాన సామాజిక  వర్గాలు తెరాసకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని ప్రొఫెసర్ విశ్లేషించారు. 
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాజకీయ నైజం,  స్వభావం మారిపోతున్న నేపధ్యంలో, రానున్న  ఎన్నికలలో ఓటింగ్ సరళి కూడా మారి పోతుందని ఆయన విశ్లేషిస్తున్నారు. అంతేకాదు, తెలంగాణ  సెంటిమెంట్ చెదిరి పోయిన నేపద్యంలో, తెలంగాణ ఉద్యమంతో ముడిపడిన, అనేక కులాలు, ఇప్పడు అధికార తెరాసకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు సిద్దమవుతున్నాయని చెప్పు కొచ్చారు. అయినా, తెరాస సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని పేర్కొనారు. మిత్ర పక్షం ఎంఐ ఎంతో కలిసినా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ రాదని, తిమల ఒక నివేదికలో పేర్కొన్నారు. 
అదే విధంగా రెడ్డి సామాజిక వర్గం, ఇప్పడు మరోసారి కాంగ్రెస్ వైపు మొగ్గు  చూపుతోంది.

నిజానికి 1940ల నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. బ్రాహ్మణ, మాల సామాజిక వర్గాలను కలుపుకుని కాంగ్రెస్’కు దన్నుగా నిలిచింది. ఇప్పుదు కూడా  రెడ్డి సామాజిక వర్గం ఓటులో 99 శాతం కాంగ్రెస్ వైపే మొగ్గుచుపుతున్నారు. తెరాసకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తారని, ఇతర పార్టీలలో ఉన్న రెడ్డి సామజిక వర్గాన్ని పక్కన పెడితే, సాధారణ ఓటర్లు ప్రధానంగా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. అదే విధంగా, తమకు పట్టున్న ప్రాంతలలో కమ్మ సామాజిక వర్గం,ఇప్పటికీ టీడీపీ వైపే మొగ్గు చూపుతోంది. టీడీపీ  సమస్థాగతంగా నిలబడితే, కమ్మ సామాజిక వర్గం టీడీపీకి ఓటేసేందుకు సిద్దంగా వుందని అయన విశ్లేషించారు. 

ఇక మరో కీలక సామజిక వర్గం  మున్నూరు  కాపుల విషయానికి వస్తే, సంఖ్యపరంగా చూస్తే, చాల బలమైన సామాజిక వర్గం. ఆ బలంతోనే మున్నూరు కాపులకు అన్ని పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. పదవులు ఇస్తున్నాయి.అయితే మున్నూరు కాపులు ఒక వ్యవస్థీకృత రాజకీయ శక్తిగా నిలిచే పరిస్థితి ఇంకా రాలేదు ఈసారి ఈ సామజిక వర్గం ఓట్లు బీజేపీ, తెరాస సగం సగం పంచుకునే అవకాశం ఉందని ప్రొఫెసర్ తమ విశ్లేషణలో పేర్కొన్నారు. 

అలాగే, సంప్రదాయంగా కాంగ్రెస్ పార్టీని  కొమ్ము కాస్తారని పేరున్న పద్మశాలీలు గడచిన రెండు ఎన్నికలో తెరాస వైపు మొగ్గు చూపినా,  ఈ సారి మళ్ళీ, కాంగ్రెస్ కే జై కొడతారని ఆయన వివరించారు. ప్రధానంగా కల్లు వ్యాపారంలో ఉన్న గౌడ సామాజిక వర్గ  కుడా ఈసారి తెరాసకు వ్యతిరేకంగా ఓటు వేయాలనే నిర్ణయానికి వచ్చింది. నిజానికి కుల వృత్తుల పై ఆధార పడే వర్గాలు అన్నీ,తెరాస ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. 

యాదవ సామాజిక వర్గం ఓటు బలమున్న సామాజిక వర్గం. అలాగే, రాజకీయంగానూ పట్టున్న సామజిక వర్గం. అయితే, నాయకులు పదవులు పుచ్చుకోవదమే కానీ, తమ సామాజిక వర్గం అభివృద్ధికి పని చేయడం లేదనే ఆరోపణ యాదవ్ నేతలపై వుంది. అందుకే ఆ వర్గం ఓటు ఎటుపడుతుందో ఉహించడం కష్టమని ప్రొఫెసర్ పేర్కొన్నారు. తెరాసతో ముదిరాజుల హనీమూన్ ముగిసింది, ఇప్పడు వారు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇక తెలంగాణ ఉద్యమంలో కీలక భూమికను పోషించిన ఇతర కులాలు, ఎంబీసీలు రాష్ట్ర జనాభాలో నాలుగో వంతున్నారు.

తెరాస ప్రభుత్వం వారి గోడు అసలు పట్టించుకోలేదనే తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్న అ వర్గం, తెరాసను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 15 శాతం వరకు ఉన్న సంచార జాతులు అంతే, తెరాసకు వ్యతిరేకంగా ఉన్నారు, మాలలు, కాంగ్రస్ వైపు మొగ్గు చుపుతున్నారు. ఇక తెలంగాణ ఉద్యమలో క్రియాశీల పాత్రను పోషించిన, మాదిగలు, బీఎస్పీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే బీఎస్పీ, తెరాసతో  పొత్తు పెట్టుకుంటే, మాదిగల ఓటింగ్ సరళిలో మార్పు వచ్చే అవకాశం ఉందని ప్రొఫెసర్ తమ విశ్లేషణలో వివరించారు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తుకు అవకాశం ఉందని పేర్కొన్నారు షెడ్యూలు తెగలు ఇప్పటికే పోడు భూముల విషయంగా తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడు తున్నారు. ముస్లిం ఓటు పాత నగరంలో సహజంగానే ఎంఐఎంకు పోతుంది. జిల్లాలలో  బీజేపెకి వ్యతిరేకంగా, పోలవుతుందని,  
ఇలా ఏలా  చూసినా కుల సమీకరాణాలు, తెరాసకు వ్యతిరేకంగా ఒకటవుతున్నాయి. అయితే ఇంకా ఎటూ తేల్చుకోని సామాజిక వర్గాలు అనేక ఉన్నాయి, ఎన్నికల ప్రకటన వచ్చిన  తర్వాత కానీ, ఈ సామాజిక వర్గాలు ఒక నిర్ణయానికి రాక పోవచ్చును. ఎన్నికల పై డబ్బు ప్రభావం ఎటూ ఉంటుంది. పట్టణ ప్రాంతాల ఉద్యోగులలో, అసంతృప్తి  వుంది. సకాలంలో జీతాలు, పెన్షన్లురాని, ప్రభుత్వ ఉద్యోగాలోనే కాదు, ప్రైవేటు ఉద్యోగులలో కూడా తెరాస ప్రభుత్వం పట్ల వివధ కారణాల వలన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విశ్వవిద్యాలయ విద్యార్ధులు, నిరుద్యోగ యువత  ఆందోళన బాట పట్టారు. తెరాస ప్రభుత్వం, మంత్రులు ప్రజాస్వామ్య విలువలను పాతరేసే తీరు పట్ల  మేథావి వర్గం మండిపడుతోంది.  

ఇలా ఎలా చూసినా, కులాల వారీగా సేకరించిన సమాచారం ప్రకారం చూసినా ప్రభుత్వ వ్యతిరేక వ్యక్తమవుతోంది. సో.. మరో సారి తెరాస గెలవదు. ఆ అవకాశమే లేదు. అయితే, బీఎస్పీ వంటి చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తెరాస పరిరిస్థితి కొంత మెరగయ్యే అవకాశం ఉండవచ్చును. అయితే, తెరాస సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా, కేవలం ఎంఐఎం మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు . పార్టీ ఫిరాయింపులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. మరో వంక,బీజేపీ ఎదుగుదలకు కొన్నిఅవరోధాలు ఉన్నా, అవ్యవస్తీకృత  సామాజిక వర్గాలను ఆకట్టుకుని సంస్థాగతంగా  ఆ వర్గాలకు చేరువ కావడంతో పాటుగా ఉత్తర ప్రదేశ్’లోలాగా వెనకబడిన కులాలో మరింత వెనకబడిన కులాలను కలుపుకు పోగలిగే స్థాయిని బట్టే పార్టీ భవిష్యత్ ఆధరపడి ఉంటుందని ప్రొఫెసర్ తిరుపతి  విశ్లేషించారు.