రోడ్డుపై మాజీ ఎంపీని దోచుకున్న దొంగలు

ఇద్దరు దొంగలు మాజీ ఎంపీ డబ్బునే దోచుకోనిపోవడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సంఘటన హైదరాబాద్ లోని ఆబిడ్స్ లో జరిగింది. టీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ మందా జగన్నాథానికి సంబంధించిన 90 వేల రూపాయల నగదు, పాస్ పోర్ట్ ను దొంగలు దోచుకొని పారిపోయారు. ఆబిడ్స్ లో షాపింగ్ మాల్ వద్ద ఆగివున్న కారు నుంచి దొంగలు ఈ సొమ్మును కాజేశారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి రోడ్డు మీద పడివున్న పది రూపాయల నోట్లను తనకు చూపించి తన దృష్టి మళ్లించారని డ్రైవర్ శ్రీనివాస రెడ్డి పోలీసులకు చెప్పారు. తాను వారి వెంట పడినప్పటికి ఫలితం లేకపోయిందని అతను తెలిపాడు. ఆ పని స్థానిక ముఠా పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.