ఓటుకు నోటు.. సీబీఐ కి ఇవ్వం.. హైకోర్టు

ఓటుకు నోటు కేసులో సంబంధించి మరో పరిణామం చోటు చేసుకుంది. నోటుకు ఓటు కేసును కేంద్ర సీబీఐ దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని న్యాయవాది పీవీ కృష్ణయ్య పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేసిన హైకోర్టు ఓటుకు నోటు కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఇవ్వలేమని తేల్చి చెప్పింది. సదరు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్లో ప్రజా ప్రయోజనం కనిపించలేదని.. అందుకే కేసును కేంద్ర సీబీఐ దర్యాప్తు సంస్థకు అప్పగించమని చెప్పింది. కాగా ఓటుకు నోటు కేసును తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.