TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సండ్రకు థర్డ్ డిగ్రీ వద్దు

Published on: Thu Jul 9, 2015 10:45AM

 

ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్నా సండ్ర వెంకట వీరయ్యను విచారణ నిమిత్తం ఈరోజు ఏసీబీ కార్యాలయానికి తరలించారు. న్యాయవాదుల సమక్షంలో ఏసీబీ అధికారులు సండ్రను రెండు రోజుల పాటు విచారించనున్నారు. అయితే సండ్రను విచారించడానికి ఏసీబీ అధికారులకు కోర్టు కొన్ని సూచనలు చేసింది. సండ్ర ప్రజాప్రతినిధి కాబట్టి అతనికి థర్డ్ డిగ్రీ లాంటివి ఉపయోగించవద్దని.. అతని న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిపాలని.. అంతేకాక సండ్రకు ఆరోగ్యం బాలేదు కనుకు విచారణ సందర్భంగా ఒక డాక్టర్ ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. గురువారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు.. శుక్రవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు విచారించవచ్చని.. విచారణ చేస్తున్నప్పుడు వేధింపులకు గురిచేయవద్దని తెలిపింది. కాగా ఈ కేసులో సండ్రకు ముందు నోటీసులు జారీ చేసినా అప్పుడు విచారణలో పాల్గొనలేదు. రెండోసారి సెక్షన్ 41(ఏ) ప్రకారం మళ్లీ సండ్రకు ఏసీబీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే..