నగరపాలెంలో దువ్వాడపై కేసు నమోదు
Published on: Thu Mar 6, 2025 9:58AM
వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. జగన్ ఐదేళ్ల పాలనలో అహంకారం తలకెక్కిన వైకాపా నేతలు కారు కూతలు కూశారు.కూటమి ప్రభుత్వ వచ్చాక చట్టం తన పని తాను చేసుకుపోతోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. జన సేనాని పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై దువ్వాడపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. సినీ నటుడు పోసాని కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసి కటకటాలపాలయ్యారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కూడా గుంటూరు నగరంపాలెం పీఎస్ లో కేసు నమోదు చేశారు. జనసేన నాయకుడు అడపా మాణిక్యాలరావు ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.


