పట్టాలు తప్పిన రైలు..55 మంది మృతి
posted on Oct 22, 2016 10:35AM
రైలు పట్టాలు తప్పి జరిగిన ప్రమాదంలో దాదాపు 55 మంది మృతి చెందారు. ఈ ఘటన ఆఫ్రికా దేశం కమెరూన్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రాజధాని యోహోండ్ నుంచి పోర్ట్ నగరం డౌలాకు వెళ్తోన్న ప్యాసింజర్ రైలు.. ఇస్కా పట్టణ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 55 మంది మృతిచెందగా.. దాదాపు 575 మంది గాయపడినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని... రైలు బోగీల కింద చిక్కుకున్న వాళ్లను తొలగిస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే కమెరూన్లో ఇటీవల భారీ వర్షాలు కురవడం వల్ల రోడ్లలన్నీ మూసుకుపోయాయి. ఆ కారణంగా ట్రెయిన్లు అన్నీ భారీ జనంతో కిక్కిరిసిపోతున్నాయి. అలాగే సాధారణంగా ఈ రైలు 600 మంది ప్రయాణికులతో వెళ్లాల్సింది.. 1300 మంది ప్రయాణం చేస్తున్నారు.