అక్కడ కూడా మనమే.. భారత్ సైన్యానికి స్వర్ణ పతకం..
posted on Oct 22, 2016 4:50PM
పాక్ పై భారత్ సర్జికల్ దాడులు చేసిన నేపథ్యంలో.. పాకిస్థాన్ తరచూ భారత్ సరిహద్దులో కాల్పులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. పాక్ కాల్పులకు భారత్ సైన్యం కూడా ధీటుగా సమాధానం చెబుతుంది. అయితే ఇప్పుడు మన సైన్యానికి స్వర్ణ పతకాలు లభించాయి. పాక్ సరిహద్దుల్లో ఉగ్రవాదంపై పోరాటంలోనే కాదు అంతర్జాతీయ మిలిటరీ పోటీల్లోనూ మాకు మేమే సాటి అని భారత సైన్యం నిరూపించింది. 8 గూర్ఖా రైఫిల్స్లోని రెండో బెటాలియన్కు చెందిన 8 మంది సభ్యులకు స్వర్ణ పతకాలు అందాయి. కాగా వేల్స్లోని గరుకైన, ఎగుడు దిగుడు రాళ్లతో ప్రమాదకరంగా ఉండే కాంబ్రియన్ పర్వతాల్లో ఈ అంతర్జాతీయ పోటీని ఏటా నిర్వహిస్తారు. ప్రపంచంలోని అత్యంత కఠినమైన ప్యాట్రోల్ ఎక్స్ర్సైజుల్లో ఇదొకటి. ఈ పోటీల్లో అద్భుత ప్రతిభ కనపరచి.. 8 మంది భారత సైన్యం స్వర్ణ పతకాలు సాధించారు. దీనికి గాను బ్రిటిష్ ఆర్మీ సైతం బృందానికి అభినందనలు తెలిపింది.