TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పొట్టలో ఫోన్.. వైద్యుల నిర్లక్ష్యం

Published on: Sat May 16, 2015 3:59PM

 

వైద్యులను దేవుళ్లతో పోల్చుతాం ఎందుకంటే వాళ్లు ప్రాణాలు నిలబెడతారు కాబట్టి. అలాంటి వైద్యులే నిర్లక్ష్యంగా ఉంటే మనిషి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఇక్కడ ఓ డాక్టర్ ఏకంగా పొట్టలో సెల్ ఫోన్ పెట్టి ఆపరేషన్ చేసింది. ఈ ఘటన యెమన్లోని అల్ బషర్ ఆసుపత్రిలో జరిగింది. యెమన్ కు చెందిన హనన్ మహమూద్ అబ్దుల్ కరీం అనే మహిళ ప్రసవం కోసం ఆస్పత్రకి వెళ్లగా అక్కడ ఆమెకు సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ఓ మహిళా వైద్యురాలు ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డను కాపాడారు. అనంతరం ఆమె బిడ్డతో ఇంటికి వెళ్లిపోయింది. ఇంతలో సడెన్ గా అబ్దుల్ కరీంకు పొట్టలో వైబ్రేషన్ రావడం, కడుపునొప్పి రావడంతో మళ్లీ పరుగుపరుగున ఆస్పత్రికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన తరువాత బాధితురాలని ఎక్స్రే తీసుకోవాలని సూచించారు. అబ్దుల్ కరీం వారి సూచన మేరకు ఎక్స్రే తీసుకోగా ఎక్స్రే తీసిన టెక్నీషియన్లు ఆమె పొట్టలో మొబైల్ ఫోన్ ఉండటం చూసి నోరెళ్ల పెట్టారు. అసలు సంగతి ఏంటంటే సిజేరియన్ చేసిన డాక్టర్ తన మొబైల్ ను అబ్దుల్ కరీం పొట్టలో పెట్టేసి కుట్లు వేసేసింది. ఇప్పుడు ఈ ఘటన జోర్డాన్ పార్లమెంటులో దుమారం రేపుతోంది.