బీవీ పట్టాభిరాం ఇక లేరు
Published on: Tue Jul 1, 2025 5:16PM
.webp)
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి బీవీ పట్టాభిరామ్ (75) కన్నుమూశారు. సోమవారం రాత్రి హైదరాబాద్లో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. కేవలం హిప్నాటిస్ట్ గా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగానే కాకుండా ఆయన తన ప్రసంగాలూ, ప్రదర్శనలతో సమాజంలో , వ్యక్తులలో డిప్రషన్ ను అధిగమించి మానసిక స్థైర్యం పెంపోందించేలా కృషి చేశారు. అత్యంత క్లిష్టతరమైన మానసిక శాస్త్ర అంశాలను సామాన్యులకు సైతం అవగత మయ్యేలా వివరించడం ఆయనకు మాత్రమే సాధ్యం అన్నట్లుగా ఆయన ప్రసంగాలు ఉండేవి. ఆ
యన మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిదంటూ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పట్టాభిరాం అంత్యక్రియలు బుధవారం (జూలై 2) జరగుతాయి.


