సిమ్లాలో ఘోర ప్రమాదం..28 మంది మృతి

హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి సోలన్ నుంచి కిన్నూర్‌కు 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు రామ్‌పూర్ వద్ద కొండలపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొడుతూ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 20 మంది దుర్మరణం పాలయ్యారు.. సమాచారం అందుకున్న సహాయక బృందాలు హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి.. అక్కడ చికిత్స పొందుతూ 8 మంది మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.