నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం..20 మంది మృతి

నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోవడంతో 20 మంది జలసమాధి అయ్యారు. ప్రయాణికులతో వెళ్తోన్న ఓ బస్సు తెల్లవారుజామున ఖాట్మాండ్‌కు 120 కిలోమీటర్ల దూరంలోని చందిభంజ్యాంగ్ ప్రాంతంలో అదుపుతప్పి త్రిశోలి నదిలో పడిపోయింది. బస్సు దాదాపు నీటిలో మునిగిపోవడం..అందరూ గాఢనిద్రలో ఉండటంతో 20 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 17 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన గ్రామస్థులు వెంటనే క్షతగాత్రులను బయటకు తీశారు. లేకుంటే ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉండేది.