బురిడి బాబా బుట్టలో ఐఏఎస్ అధికారి కూడా....

 

లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్ రెడ్డిని బురిడీ కొట్టించి దాదాపు 1.33 కోట్లు టోకరా వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉన్న బురిడి బాబా చెబుతున్న విషయాలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పటికే ఎంతో మందిని బురిడి కొట్టించిన బాబా వలలో ఏపీ కేడర్ కు చెందిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా ఉన్నాడట. శివానంద మాయమాటలు నమ్మిన ఆ ఐఏఎస్ అధికారి బాబాకు రూ.50 లక్షలు సమర్పించుకున్నాడట. చేతిలో డబ్బులు పడగానే మాయమైన బురిడీ బాబా తనను నిలువునా ముంచాడని గుర్తించినా... ఎక్కడ పరువు పోతుందోనన్న భయంతో ఆ ఐఏఎస్ అధికారి నోరు విప్పేందుకు భయపడుతున్నారట.