ఫిలింనగర్‌లో ఘోర ప్రమాదం..కుప్పకూలిన భవనం

హైదరాబాద్ ఫిలింనగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం పునాదులతో సహా కుప్పకూలింది. శిథిలాల కింద పలువురు కూలీలు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను ప్రారంభించారు. ఇప్పటి వరకు రెండు మృతదేహలను వెలికితీశారు. శిథిలాల కింద మరింత మంది కూలీలు ఉండటంతో జేసీబీల సాయంతో వేగంగా తవ్వకాలు జరపుతున్నారు. ప్రమాద సమయంలో 20 మంది వరకు కూలీలు పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం.