నిర్మాత కేఎస్ రామారావును అరెస్ట్ చేయొద్దు-హైకోర్టు

ప్రముఖ నిర్మాత, ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధ్యక్షుడు కేఎస్ రామారావుకు ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 24న ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్‌నగర్ కన్వెన్షన్ సెంటర్‌లో పోర్టికో కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు  అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు మిగతా కార్యవర్గంపై క్రిమినల్ కేసులు నమోదుచేసి నోటీసులు జారీ చేశారు. దీంతో కౌన్సిల్‌కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తోన్న కేఎస్ రామారావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రామారావును అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. క్రిమిలన్ ప్రోసీజర్ కోడ్‌లోని సెక్షన్ 41 నిబంధన పాటించి ఆయన వద్ద వివరణ తీసుకోవాలని సూచించింది.