కోడెల సాయం చేయకపోతే చిప్ప కూడు తినేవాడివి: విజయసాయిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్

 

 

టీడీపీ సీనియర్ నేత, ఎపి మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య  చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. దీని పై ట్విట్టర్ లో స్పందించిన వైసిపి ఎంపీ విజయ్ సాయి రెడ్డి " కోడెల గారి మరణాన్ని చంద్రబాబు రాజకీయం చేసి అయన ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారు. కోడెల ఆపదలో ఉన్నపుడు టీడీపీ, బాబు అండగా నిలవలేదనే" నిస్పృహ తోనే అయన ఆత్మహత్యకు పాల్పడ్డారని విమర్శించారు. ఐతే ఈ తీవ్ర వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా కౌంటర్  ఇచ్చారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. "శవాల మీద చిల్లర ఏరుకొని రాజకీయం చేసే నువ్వు కూడా కోడెల గురించి మాట్లాడటం విడ్డురంగా వుంది శకుని మామా.. రాజ్యసభ ఎన్నికలలో కోడెల గారు నీకు సాయం చెయ్యకపోతే ఇప్పటికీ జైల్లో చిప్పకూడు తినేవాడివి మరిచిపోయావా? ఒకసారి గతం గుర్తు చేసుకో... కోడెల గారి మీద కేసు పెడితే సాయం చేస్తా అని నువ్వు పెట్టిన ట్వీట్లు ప్రజలంతా చూసారు. ఇప్పుడు వచ్చి కోడెలగారి మరణాన్ని తెదేపా వాళ్ళు రాజకీయం చేస్తున్నారని నంగనాచి కబుర్లు చెప్పకు. నువ్వు నీ దొంగల ముఠా వేధింపులవల్లనే పులిలా బ్రతికిన కోడెల ఆత్మహత్య చేసుకున్నారు.  " అంటూ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు.