బెస్ట్ డెడ్ బాడీ ఈవెంట్ మేనేజర్ గా జగన్ కి అవార్డు!!

 

ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం శృతిమించుతోంది. ముఖ్యంగా వైసీపీ విజయసాయిరెడ్డి, టీడీపీ నేత బుద్దా వెంకన్న.. ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

తాజాగా విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఎల్లో మీడియా సౌజన్యంతో.. కోడెల శివప్రసాద్ అంత్యక్రియల సందర్భంగా చంద్రబాబు తన ఈవెంట్ మేనేజ్ మెంట్ స్కిల్స్ ను అద్భుతంగా ప్రదర్శించారని విజయసాయి విమర్శించారు. కోడెలపై అంతకుముందు వర్ల రామయ్య వంటి నేతలను చంద్రబాబు ఉసిగొల్పి, అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు పల్నాటి పులి అంటూనే కోడెలను తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేశారని దుయ్యబట్టారు.

విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు బుద్దా వెంకన్న అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఇటీవల మీరు చేసిన 'బాత్రూంలో బాబాయికి గుండెపోటు' ఈవెంటును కూడా బాగా రక్తి కట్టించారని.. వైసీపీ శవ రాజకీయాలను చూసి ఇప్పటికే అనేక సార్లు ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు శకుని మామా అంటూ ఎద్దేవా చేశారు. బెస్ట్ డెడ్ బాడీ ఈవెంట్ మేనేజర్లుగా మీ దొంగబ్బాయి జగన్ కి, మీకు అవార్డులు వచ్చిన సంగతి మర్చిపోయారా శకుని మామా? అని వ్యాఖ్యానించారు. మహామేత శవం దొరక్కముందే దొంగబ్బాయిని సీఎం చేయాలని మీ ఆధ్వర్యంలో జరిగిన సంతకాల సేకరణ, ఓదార్పు యాత్ర బెస్ట్ ఈవెంట్స్ గా నిలిచాయి కదా? అని బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శించారు.