గ్రాఫిక్సేగా దూకండి.. నేను కింద వెయిట్ చేస్తా: విజయ్ సాయికి వెంకన్న సవాల్ 

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ చూపించారంటూ వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ పై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నఅంతే ఘాటుగా స్పందించారు.

"యుశ్రారైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్..! అమరావతిని గ్రాఫిక్స్ అంటూ ట్వీట్ చేసిన సాయిరెడ్డి గారికి దమ్ముంటే అమరావతిలో చంద్రబాబు గారు కట్టిన భవనం పైనుండి దూకి గ్రాఫిక్స్ అని నిరూపించాలి. మూడు ముక్కలాట మొదలెట్టి ఒక్క ఇటుక పెట్టలేదు. మీరా విశాఖలో అద్భుత నగరాన్ని కట్టేది..! బ్లూ మీడియాలో గ్రాఫిక్స్ జనాన్ని పెట్టినంత వీజీ కాదు రాజధాని నిర్మాణం అంటే సాయిరెడ్డి సాబ్. ఎప్పుడు వస్తారో చెబితే మీడియాతో సహా బిల్డింగ్ కింద వెయిట్ చేస్తా'' అంటూ వెంకన్న సెటైర్లు వేశారు.