TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీటెక్ విద్యార్థి యవన్ హత్య కేసులో 10 మంది నిందితులు అరెస్ట్

Published on: Mon May 11, 2026 9:19PM

 

హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి బొమ్మన యవన్ అలియాస్ అఖిల్ (21) హత్య కేసును చిలకలగూడ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. పాత కక్షలు, ప్రేమ వ్యవహారం నేపథ్యంలో పక్కా పథకం ప్రకారం ఈ దారుణానికి పాల్పడిన 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీటెక్ చదువుతున్న యవన్ అనే యువకుడు చిలకలగూడకు చెందిన  చంద్రిక చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకు న్నారు.  ఈ విషయాన్ని యువతి కుటుంబ సభ్యులు అంగీకరించ లేదు.

అదే సమయంలో చంద్రికను వివాహం చేసుకోవాలని భావించిన సాయి కిరణ్ (A1) యవన్‌పై తీవ్ర ద్వేషం పెంచుకున్నాడు. హత్యకు 4–5 రోజుల ముందే మేడిబావిలో సమావేశమై యవన్‌ను హతమార్చేందుకు కుట్ర పన్నారు. చేశారు. ఈ నేపథ్యంలోనే పథకం ప్రకారం యవన్ ను చిలకలు కూడా ప్రాంతానికి వచ్చే విధంగా చేశారు...చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిబావి, ఇందిరా నగర్ కాలనీలో మే 7 రాత్రి సుమారు 9:45 గంటల సమయంలో యవన్ తన స్నేహితులతో కలిసి ఫోన్‌లో క్రికెట్ చూస్తున్న సమయంలో అక్కడికి పదిమంది నిందితులు వచ్చారు.

యవన్‌పై ఒక్కసారిగా నిందితులు మారణాయుధాలతో మెడ మరియు శరీరంలోని కీలక భాగాలపైవిచక్షణారహితంగా దాడి చేశారు. అతడు మృతి చెందినట్టు నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. యవన్ స్నేహితులు వెంటనే అతన్ని స్థానిక హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు మృతుడి తండ్రి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఈ కేసులో రౌడీ షీటర్ అల్లబోయిన సాయి కిరణ్ (27), రాజం పరమేష్ కుమార్ యాదవ్ (19), రాజం వంశీ కృష్ణ (19),రాజం మనీష్ (21),శ్రీగిరి రాహుల్ (22),కుచుల శివ నందన్ యాదవ్ (20),రాజం నరసింహ యాదవ్ (50),రాజం శ్రీశైలం యాదవ్ (48), రాజం మల్లేష్ యాదవ్ (48), బాలుడు (మైనర్) మొత్తం పది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి హత్యకు ఉపయో గించిన కత్తి,రక్తపు మరకలు ఉన్న దుస్తులు,నేరానికి వాడిన ఎలక్ట్రిక్ స్కూటర్,సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి వెల్లడించారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవు..సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే సందేశాలు పంపేవారిపై నిఘా పెంచాం‌.నిందితులకు కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం“పౌరుల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడము. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతాం” అని డీసీపీ రక్షిత కృష్ణమూర్తి స్పష్టం వ్యక్తం చేశారు.