భారత్ పై పాక్ కాల్పులు... వీడియో విడుదల

 

భారత్ సైన్యంపై పాక్ సైన్యం తరచూ కాల్పులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాక్ సైన్యంపై దాడి జరిపిన భారత్ సైన్యం.. హిరానగర్ సెక్టార్‌లో పాక్ రేంజర్లను హత మార్చిన సంగతి తెలిసిందే. ఆరుగురు  పాక్ రేంజర్లను, ఓ ఉగ్రవాదిని భారత్ సైన్యం హతమార్చినట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన థర్మల్ ఇమేజెస్, వీడియోను బీఎస్ఎఫ్ విడుదల చేసింది. బీఎస్ఎఫ్ ఔట్‌పోస్ట్‌లపై బాంబులు విసురుతూ, ఆ తర్వాత జవానులు జరిపిన కాల్పుల నుంచి తప్పించుకోవడానికి వారు కిందకు వంగుతూ, సమయం చూసి తిరిగి దాడులకు పాల్పడుతున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. కాగా శుక్రవారం ఉదయం 9.35 గంటల సమయంలో కథువా జిల్లా హిరానగర్ సెక్టార్‌లో భారత ఔట్‌పోస్ట్‌లపై పాక్ రేంజర్లు స్నైపర్ దాడులు జరిపారని బీఎస్‌ఎఫ్ తెలిపింది. దీంతో భారత బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయని, ఏడుగురు పాక్ రేంజర్లు, ఓ ఉగ్రవాది మరణించారని బీఎస్‌ఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు.