భారీగా కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, దేశీయ పరిణామాల నేపథ్యంలో ఇవాళ స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. ఆరంభంలోనే నెగిటివ్‌గా ఉన్న మార్కెట్లు భారీగా నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో మరింత బలహీనపడ్డాయి. 200 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ 28,000 పాయింట్ల మద్ధతు నుంచి, నిఫ్టీ 8650 స్థాయి నుంచి దిగజారింది. సెన్సెక్స్ 27,877 వద్ద, నిఫ్టీ 59 పాయింట్ల నష్టంతో 8632 వద్ద ట్రేడవుతోంది. అటు అక్టోబర్ డెరివేటివ్ సిరీస్ నిన్నటితో ముగియడంతో ఇన్వెస్టర్లు సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోంది. ప్రధానంగా బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఆటో, ఐటీ, మెటల్స్ రంగాలు నష్టపోయాయి.