TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రెవెన్యూ ఉద్యోగులకు అడ్డదారి రెవెన్యూ

Published on: Tue Aug 28, 2012 5:00PM

రెవెన్యూ శాఖలో లంచగొండులెక్కువైపోయారు. మన రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. అవినీతికి అలవాటుపడిపోయిన ఉద్యోగులు ఎక్కువసంఖ్యలో రెవెన్యూ శాఖలోనే ఉన్నారని లేటెస్ట్ సర్వేలు స్పష్టంగా చెబుతున్నాయ్. గడచిన మూడేళ్లలో ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ ఉద్యోగుల్లో ఎక్కువశాతంమంది రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులే. మూడేళ్లుగా రెవెన్యూ శాఖ ఉద్యోగులపై నమోదైన అవినీతి కేసులు 267. 2009లో 123 అవినీతి కేసులు విచారణకొచ్చాయి. 2010లో 41, 2011లో జూలై నెలవరకూ 33 కేసులు కేవలం రెవెన్యూ శాఖ ఉద్యోగులమీదే నమోదయ్యాయి. రెవెన్యూ శాఖకు పనిభారం కూడా ఎక్కువే. దానికితోడు ప్రజలకు ఎక్కువ అవసరాలు ఈ శాఖతోనే ఉంటాయి కనుక లంచాల వసూలుకూడా ఎక్కువేనన్న విషయంకూడా బహిరంగ రహస్యమే. రోజులకొద్దీ ఆఫీసులచుట్టూ తిరగడంకంటే టిక్కెట్టు కొట్టేసి వెంటనే పనిచేయించుకోవడమే మేలన్న ఉద్దేశానికి చాలామంది వచ్చేయడంతో ఎంతగా కంట్రోల్ చేయాలని చూసినా, ఎన్ని ఆంక్షలు విధించినా రెవెన్యూశాఖ ఉద్యోగుల చేతివాటాన్ని మాత్రం ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు.