TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పోసాని విడుదలకు బ్రేక్ 

Published on: Wed Mar 12, 2025 11:49AM

కర్నూలు జైలునుంచి సినీ నటుడు పోసాని కృష్ణ మురళి విడుదలకు  బ్రేక్ పడింది.  ఆయన కోసం గుంటూరు సిఐడి పోలీసులు పిటి వారెంట్ పట్టుకుని కర్నూలు జైలుకు వెళ్లారు. పోసానిని వర్చువల్ గా జడ్జి ఎదుట   హాజరుపర్చారు.  టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ లను  అసభ్యంగా మాట్లాడిన కేసులో పోసానిపై ఎపిలో 17 కేసులు నమోదయ్యాయి. పోసానికి నరసరావుపేటకోర్టు 20 వేల పూచికత్తు, రెండు జామీన్లపై బెయిల్ మంజూరు చేసింది. పోసానికి బెయిల్ లభించినప్పటికీ  తాజా పరిణామంతో విడుదలకు బ్రేక్ పడింది.