పద్మశ్రీ పోగొట్టుకున్న బ్రహ్మి, కలెక్షన్ కింగ్
Published on: Mon Dec 23, 2013 4:25PM

ప్రముఖ సినీనటులు మోహన్ బాబు, బ్రహ్మానందంలు వారికి ప్రభుత్వం ప్రధానం చేసిన పద్మశ్రీ అవార్డులను అగౌరవపరచారని గత బుధవారం బీజేపి అగ్రనేత ఇంద్రసేనా రెడ్డి రాష్ర్ట హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటీషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈమేరకు సోమవారం ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. మోహన్ బాబు, బ్రహ్మానందంలు పద్మశ్రీ బిరుదుని దుర్వినియోగం చేసి అగౌరవపర్చారని పేర్కొంటూ పద్మశ్రీ పురస్కారాలని వారం రోజుల్లోగా ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఎంతో ఉన్నతమైన పద్మశ్రీలను దుర్వినియోగం చేయడం వలన వీరిపై ఈ తీర్పు వచ్చింది. మరి ఈ తీర్పుకు వీరిద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలి.


