కోహ్లీకి క్షమాపణలు చెప్పిన ఆసీస్ ప్లేయర్..
posted on Mar 30, 2017 2:59PM
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆసీస్ ప్లేయర్ బ్రాడ్ హాడ్జ్ క్షమాపణలు చెప్పాడు. ఎందుకనుకుంటున్నారా..? ఆస్ట్రేలియా-టీమిండియా మధ్య టెస్ట్ మ్యాచ్ సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం నాలుగు టెస్ట్ మ్యాచ్ లో భాగంగా.. మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా కోహ్లీ భుజానికి గాయం తగిలిన సంగతి తెలిసిందే. ఇందుకుగాను కోహ్లీ నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. అందుకు గాను హాడ్జ్ ఐపిఎల్లో ఆడేందుకే ధర్మశాల టెస్టుకు విరాట్ దూరంగా ఉన్నాడని.. దేశం కోసం టెస్ట్ మ్యాచ్ ఆడకుండా, ఐపీఎల్ కోసం విరాట్ రెస్ట్ తీసుకున్నాడని కామెంట్స్ చేశాడు. అయితే అతను చేసిన కామెంట్స్ పై విమర్శలు రావడంతో హాడ్జ్ క్షమాపణ చెబుతూ ట్వీట్ చేశాడు. భారతీయులకు, క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా విరాట్ కోహ్లీకి క్షమాపణ చెబుతున్నట్లు.. విరాట్ను ప్రొఫెషనల్గా గౌరవిస్తానన్నాడు.