తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు
Published on: Tue Dec 3, 2024 3:45PM
ఆగ్రాలోని తాజ్ మహల్ పేల్చేస్తామని ఉత్తర ప్రదేశ్ పర్యాటశాఖకు మంగళవారం ఈ మెయిల్ వచ్చింది. దీంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాండ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తాజ్ మహల్ పరిసర ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ బాంబుకు సంబంధించి ఎలాంటి క్లూ లభించకపోవడంతో ఫేక్ అని తేల్చేశారు. ఉత్తుత్తి మెయిల్ చేసింది ఎవరో పోలీసులు ఆరా తీస్తున్నారు.


