TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

 కంచగచ్చిబౌలి భూములపై బాలివుడ్ నటుడు జాన్ అబ్రహం స్పందన 

Published on: Sat Apr 5, 2025 4:48PM

హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన 400 ఎకరాల భూమి దేశ వ్యాప్త  చర్చనీయమైంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ వివాదంపై స్పందించింది. చెట్లను కొట్టివేయడాన్ని తప్పు పట్టింది. చట్టపరంగా ఈ భూమి తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఇక్కడ వన్య ప్రాణులైన పులులు, సింహాలు లేవని ప్రతిపక్ష గుంటనక్కలున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎపి డిప్యూటిసిఎం పవన్ కళ్యాణ్  మాజీ భార్య రేణుదేశాయ్ మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ భూమిని తెలంగాణ ప్రభుత్వం వదిలేయాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. రేణుదేశాయ్ తో పాటు మరికొందరు టాలివుడ్ నటులు స్పందించారు. తాజాగా బాలివుడ్ నటుడు జాన్ అబ్రహం స్పందించారు. 400 ఎకరాల్లో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారికి బాసటగా నిలిచారు. ఇక్కడ డెవలప్ మెంట్ నిలిపివేయాలని  ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభ్యర్థించారు.  చెట్లను నరికివేసే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని జాన్ అబ్రహం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఎక్స్ లో చేతులు జోడించి ఎమోజీ పోస్ట్ చేశారు.