TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కరీంనగర్ ఎమ్మెల్యే కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి

Published on: Thu May 7, 2026 2:11PM

 

కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఆయుధాల బెదిరింపుల ఘటన, నేతల మధ్య తీవ్ర విమర్శలు, అనంతరం పార్టీ శ్రేణుల దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కరీంనగర్‌లోని అల్గునూరు చౌరస్తాలో ఖాలీద్ అనే హైకోర్టు న్యాయవాదిని కొందరు దుండగులు తుపాకులతో బెదిరించిన ఘటన సంచలనం రేపింది. ఈ విషయంపై న్యాయవాది కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లభించలేదని ఆరోపించారు. దీనితో ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో రాష్ట్రంలో గన్ కల్చర్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే సమయంలో ఎమ్మెల్యే  పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. డ్రగ్స్ పరీక్షలకు కల్వకుంట్ల తారక రామారావు సిద్ధంగా ఉన్నారని, అలాగే రేవంత్ రెడ్డి మరియు  బండి సంజయ్ కుమార్ కూడా సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. బండి సంజయ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం వివాదానికి దారితీసింది. కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కరీంనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. కౌశిక్ రెడ్డి అక్కడ ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కార్యాలయానికి చేరుకుని అక్కడ ఉన్నవాహ నాన్ని కూడా ధ్వంసం చేశారు. 

ఈ దాడి జరిగిన కార్యాలయం గంగుల కమలాకర్ కు చెందిన క్యాంప్ ఆఫీస్‌గా తెలుస్తోంది. బండి సంజయ్‌పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకే నిరసనగా ఈ దాడి జరిగిందని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో కరీంనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ నాయకుల పరస్పర ఆరోపణలు, కార్యకర్తల ఆందోళనలతో జిల్లాలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు.