మెన్స్ డే కావాలని మహిళా ఎంపీ డిమాండ్ 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాజ్యసభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఎంపీలకు సహచర మగ ఎంపీలు శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఈ సందర్భంగా మెన్స్ డే కావాలని మహిళా ఎంపీ డిమాండ్ చేశారు. పురుషుల కోసం కూడా ఓ రోజు ఉండాలని బీజేపీ మహిళా ఎంపీ సోనాల్‌ మాన్‌సింగ్‌ అన్నారు. పురుషులకు ‘మెన్స్‌ డే’ నిర్వహించాలని ఆమె డిమాండ్‌ చేశారు. 

రాజ్యసభలో ఎంపీ సోనాల్‌ మాన్‌సింగి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మహిళా దినోత్సవాన్ని ఇద్దరు జర్మన్‌ దేశానికి చెందిన మహిళలు ప్రారంభించారని తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా తొలిసారి ఓ భారీ సముద్ర నౌకను మహిళలే పూర్తి స్థాయిలో​ సారథ్యం వహించటం మనదేశానికి గర్వకారణమని తెలిపారు. మహిళలు పోటీతత్వాన్ని పెంచుకోవాలని, అన్నిరంగాల్లో​ పురుషులతో సమానంగా రాణించాలని పేర్కొన్నారు. మహిళలను పురుషుల్లో సగభాగమని చెబుతున్నప్పటికీ కొన్నిచోట్ల మహిళలు తీవ్రమైన వివక్షతను ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.