రెండు రాష్ట్రాల్లో బీజీపీ ఓటమి ఖాయం!
Published on: Mon Oct 7, 2024 2:39PM

జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓటమి ఖాయమని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన జనతా కీ అదాలత్ సభలో మాట్లాడిన ఆయన డబుల్ ఇంజిన్ సర్కార్ లు విఫలమయ్యాయన్నారు. డబుల్ ఇంజిన్ ను ఆయన ద్రవ్యోల్బణం, అవినీతిగా అభివర్ణించారు. దేశంలోని బీజేపీ కూటమి పాలిత 22 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ హామీ నెరవేరిస్తే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో తాను బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని, అందుకు బీజేపీ రెడీయేనా అని సవాల్ విసిరారు.


