వదోదర నుంచి బీజేపీ అభ్యర్థి రంజన్బెన్ భట్టా
posted on Aug 26, 2014 4:11PM
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి, రాజీనామా చేసిన వడోదర స్థానం నుంచి బీజేపీ తమ అభ్యర్దిగా రంజన్బెన్ భట్టా పేరును ఖరారు చేసింది. గత ఎన్నికల సందర్భంగా వారణాసి, వడోదర లోక్ సభ స్థానాల నుంచి నుండి గెలిచిన నరేంద్ర మోడీ వారణాసి స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతూ, వదోదర స్థానం నుంచి రాజీనామా చేయడంతో వడోదర స్థానానికి సెప్టెంబర్ 13వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. వడోదర స్దానానికి బీజేపీ అభ్యర్దిగా హైకమాండా తన పేరుని ప్రకటించడంతో రంజన్బెన్ భట్టా హర్షం వ్యక్తం చేశాడు. వడోదర మున్సిపల్ కార్పోరేషన్కి జూన్లో డిప్యూటీ మేయర్గా రంజన్బెన్ భట్టా నియమితులయ్యారు. వడోదర మున్సిపాలిటీలో నాలుగుసార్లు కార్పోరేటర్గా బాధ్యతలు నిర్వహించారు.