రోడ్డు ప్రమాదం.. బీజేపీ ఎమ్మెల్యే మృతి

 

రోడ్డు ప్రమాదంలో అధికార బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్ర సింగ్ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని బిజ్నూర్ జిల్లా సితార్‌ పూర్‌ సమీపంలో లోకేంద్ర సింగ్ ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొనగా, ప్రమాదంలో లోకేంద్ర అక్కడికక్కడే మరణించారు. ఆయన వెంటే ఉన్న ఇద్దరు గన్ మెన్లు కూడా మృతిచెందారు.  విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని లోకేంద్ర, ఆయన గన్ మెన్ల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. రెండు వాహనాలు అతి వేగంతోనే కొట్టుకున్నాయని.. అందుకే కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నా, అవి వారి ప్రాణాలను కాపాడలేకపోయాయని పోలీసులు తెలిపారు.