TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజ్యసభకు బీజేపీ అభ్యర్థులు ఖరారు

Published on: Sun May 29, 2022 10:41PM

రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. 9 రాష్ట్రాల నుంచి 16 మంది అభ్యర్థులను ఖరారు చేసి వారి జాబితాను ఆదివారం విడుదల చేసింది.

బీజేపీ కేంద్ర కార్యాలయం ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటన మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు కర్నాటక నుంచి బీజేపీ మరో సారి అవకాశం కల్పించింది. అలాగే అదే రాష్ట్రం నుంచి అనిల్ సుఖ్ దేవ్ రావ్ బొండేకు అవకాశం కల్పించింది.

  మహారాష్ట్ర నుంచి పియూష్ గోయెల్, సుశ్రి కవితా పటిదార్ లను, మధ్య ప్రదేశ్ నుంచి జగ్గేష్,  రాజస్ధాన్ నుంచి లక్ష్మీకాంత్ వాజ్ పేయి, రాధామోహన్ అగర్వాల్,సురేంద్రసింగ్ నగర్, బాబూరామ్ నిషద్, దర్శన సింగ్, సంగీత యాదవ్ లకు,  ఉత్తర ప్రదేశ్ నుంచి కల్పనా సైనాకు ఉత్తరాఖండ్ నుంచి, సతీష్ చంద్రదూబేకు బీహార్ నుంచి, కిషన్ లాల్ పన్వారాకు హరియానా నుంచి అవకాశం కల్పించారు,