వేల కోట్ల అధిపతి.. అనుమానాస్పద మృతి!

 

 

 

ఆయన పేరు దాది బల్సారా. ఆయన వయసు 71 సంవత్సరాలు. ఆయన ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన వ్యాపారవేత్తల్లో ఒకరు. ప్రపంచ వ్యాప్తంగా 63 దేశాల్లో ఆయన వ్యాపార సంస్థలు వున్నాయి. కానీ, ఆయనకి నా అనేవారు ఎవరైనా వున్నట్టు దాఖలాలు మాత్రం లేవు. ఆయన న్యూఢిల్లీలోని తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లోని రూమ్ నంబర్ 901లో 1983 నుంచి ఒంటరిగా వుంటున్నారు. ఆన వ్యాపార సంస్థలన్నిటికీ పర్మినెంట్ అడ్రస్‌ హోటల్లోని ఆ రూమే. వేలకోట్ల రూపాయల విలువైన ఆస్తులు, వ్యాపార సంస్థలు వున్న గురువారం నాడు ఆయన తన రూమ్‌లో చనిపోయి వున్నారు. మంచం మీద పడుకుని వున్న ఆయన అలాగే చనిపోయి పడి వున్నాడు. గత మూడు రోజులుగా ఆయన ఆహారం సరిగా తీసుకోవడం లేదని తెలుస్తోంది. గురువారం రాత్రి ఆయన ఒక సహాయకుడిని పిలిపించుకుని తన అరికాళ్ళకు మసాజ్ చేయించుకున్నారట. తెల్లవారేసరికి డెడ్‌‌బాడీగా మిగిలాడు. తమ హోటల్‌లో గత 31 సంవత్సరాలుగా పర్మినెంట్‌ కస్టమర్‌గా వున్న బల్సారా హఠాత్తుగా చనిపోవడంతో తాజ్ మాన్‌సింగ్ హోటల్ యాజమాన్యం తమ కుటుంబంలో వ్యక్తి చనిపోయినట్టుగా బాధపడుతోంది. అయితే పోలీసులు మాత్రం బల్సారా మరణంపై తమకు తలెత్తిన అనుమానాలను నివృత్తి చేసుకునే పనిలో వున్నారు.