బీహార్ బిజేపీ వైస్ ప్రెసిడెంట్ హత్య


 

బీహార్ బిజేపీ వైస్ ప్రెసిడెంట్ విశేశ్వర్ ఓజాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బీహార్ లోని అరా జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. బీహార్ బిజేపిలో కీలకంగా ఉన్న విశేశ్వర్ ను ఎవరు చంపారన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆయనకు ఏమైనా వ్యక్తిగత తగాదాలున్నాయా అన్న దానిపై కూడా విచారణ జరుగుతోంది.