బీహార్ వరదల్లో 153 మంది మృతి...

 

బీహార్ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల ధాటికి బిహార్‌లోని17 జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఇక ఈ వరదలు బీభత్సానికి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే 153 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కోటి మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ నుంచి 1,152 మంది సిబ్బంది, ఆర్మీ నుంచి 2,228 మంది సిబ్బంది సహాయకచర్యల్లో పాల్గొన్నారని తెలిపారు.