ఐఏఎస్ శివశంకర్ కు భారీ ఊరట... ఎపికి కేటాయిస్తూ క్యాట్ ఆదేశాలు
Published on: Fri Feb 28, 2025 3:48PM
ఐఏఎస్ అధికారి ఎల్. శివ శంకర్ కు భారీ ఊరట లభించింది. తన స్వంత రాష్ట్రమైన ఎపికి కేటాయించాలని శివ శంకర్ న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. విభజన సమయంలో తనకు తెలంగాణకు కేటాయించడం పట్ల ఆయన చేస్తున్న న్యాయపోరాటానికి కూటమి నేతలు సమర్ధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును స్వయంగా శివశంకర్ నివేదించడంతో సమస్య పరిష్కారమైంది. చంద్రబాబు కేంద్రంతో మాట్లాడటంతో శివశంకర్ ను నాలుగువారాల్లో ఎపి కేడర్ కు కేటాయిస్తూ క్యాట్ డీవోపీటీకి ఆదేశాలు జారి చేసింది.


