బిగ్ బజార్ దొంగలు దొరికారు

 

హైదరాబాద్‌ కాచిగూడలోని బిగ్ బజార్‌లో భారీ చోరీ చేసిన దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణాజిల్లా నందిగామలో వీరిని పోలీసులు ఆదివారం నాడు పట్టుకున్నారు. గతంలో బిగ్ బజార్‌లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేసిన వారే 50 లక్షలకు పైగా విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను శుక్రవారం అర్థరాత్రి పథకం ప్రకారం దోచుకున్నారు. గతంలో బిగ్‌బజార్‌‌లో పనిచేసిన ముగ్గురు సెక్యూరిటీ గార్డులు పక్కా ప్రణాళికతో చోరీ చేశారని సీసీ కెమెరా ఫూటేజ్‌ల ద్వారా వెల్లడైంది. అస్సోం, అరుణాచల్‌ప్రదేశ్‌లకు చెందిన పప్పుదాస్, కమల్‌దాస్, రజినిపెగ్‌‌తో పాటు మరో ఇద్దరిని కాచిగూడ పోలీసులు కృష్ణాజిల్లా నందిగామలో అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.50 లక్షల విలువైన ల్యాప్ టాప్‌లు, కెమెరాలు, ఐఫోన్ తదితర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను స్వాధీనం చేసుకున్నారు.