అఖిలప్రియకు కోర్టులో చుక్కెదురు..

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది. ఈరోజు జరిగిన విచారణలో న్యాయస్థానం అఖిల ప్రియకు బెయిల్ నిరాకరించింది. అఖిలప్రియను మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఆమె పోలీసు కస్టడీ ఈరోజు నుండి మొదలు కానుంది.

ఈ కేసులో అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోర్టులో కౌంటరు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈకేసుకు సంబంచించిన సాక్ష్యాల సేకరణకు దర్యాప్తు బృందాలు ప్రయత్నిస్తున్నాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. అఖిలప్రియ బెయిల్‌పై బయటకు వస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని కోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో పోలీసులు పేర్కొన్నారు. అఖిలప్రియకు ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావితం చేయగలిగే పలుకుబడి ఉందని పోలీసులు ఆ కౌంటర్ లో తెలిపారు.